T20 World Cup 2025: ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినా.. భారత మహిళలకు నయా పైసా ఇవ్వని ఐసీసీ.. కారణమిదే

3 hours ago 1

ప్రతిష్ఠాత్మక అండర్ 19 మహిళల టీ 20 ప్రపంచకప్ ను భారత జట్టు గెల్చుకుంది. . అయితే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ నుంచి ఎలాంటి ప్రైజ్ మనీ అందలేదు. అదే సమయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం భారీ నజరానా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినా.. భారత మహిళలకు నయా పైసా ఇవ్వని ఐసీసీ.. కారణమిదే

Indian Womens Under 19 Team

Basha Shek

|

Updated on: Feb 02, 2025 | 8:07 PM

కేవలం 8 నెలల్లో భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త అందింది. జూన్ 29, 2024న బార్బడోస్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి రెండవసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు, 2025 ఫిబ్రవరి 2న జరిగిన అండర్-19 మహిళల T20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించి నిక్కీ ప్రసాద్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.అయితే ప్రపంచకప్ గెలిచిన పురుషుల జట్టుకు కోటి రూ. ప్రైజ్ ఇచ్చిన ఐసీసీ మహిళా జట్టుకు మాత్రం నయా పైసా ఇవ్వలేదు. ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత మహిళలు ఏకపక్షంగా ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. తద్వారా 2023 తర్వాత వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. నిజానికి ఐసీసీ ఈవెంట్‌లో గెలిచిన ప్రతి జట్టుకు ఐసిసి డబ్బు రూపంలో రివార్డ్ ఇస్తుంది. కానీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ నుంచి ఎలాంటి రివార్డు లభించలేదు. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ చైర్మన్ జైషా ప్రపంచకప్ ట్రోఫీని అందించారు. అందరికీ పతకాలు అందజేశారు. అయితే జట్టుకు మాత్రం ఎలాంటి పారితోషికం అందలేదు. నిజానికి అండర్-19 ప్రపంచ ఛాంపియన్ జట్టుకు రివార్డు రాకపోవడం ఇది మొదటి సారి కాదు. రెండేళ్ల క్రితం ఈ టోర్నీలో భారత జట్టు తొలిసారి టైటిల్‌ గెలిచినప్పుడు కూడా నగదు బహుమతి లభించలేదు. వాస్తవానికి ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం అండర్-19 స్థాయిలో ప్రపంచ కప్‌ విజేతలకు ఎలాంటి ప్రైజ్ మనీ లభించలేదు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న అండర్-19 పురుషుల ప్రపంచకప్‌లో కూడా విజేత జట్టుకు డబ్బు రూపంలో ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. ఆటగాళ్లకు పతకాలతోపాటు ట్రోఫీలు మాత్రమే అందజేస్తారు.

ఐసీసీ నుంచి ఎలాంటి బహుమతి రాకపోవచ్చు కానీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నుంచి భారీ బహుమతి అందుతుంది. గత సారి ప్రపంచకప్ గెలిచిన అండర్-19 జట్టుకు బీసీసీఐ స్వయంగా 5 కోట్ల బహుమతి ప్రకటించింది. అదేవిధంగా 2022లో అండర్-19 పురుషుల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ భారీ ప్రైజ్ మనీని కూడా ప్రకటించింది. అందువల్ల ఇప్పుడు చాంపియన్ గా నిలిచిన మహిళల జట్టుకు భారీ నగదు బహుమతి లభించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

భారత క్రికెట్ జట్టుతో ఐసీసీ ఛైర్మన్ జైషా..

Congratulations to @BCCI connected back-to-back @ICC U19 Women’s T20 World Cup titles. And kudos to each the participating teams who took portion successful this precise successfully hosted tourney by @MalaysiaCricket – important to the planetary improvement of the women’s crippled #U19WorldCup. pic.twitter.com/8EOTVfTLCH

— ICC (@ICC) February 2, 2025

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article