Viral: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ మట్టి కుండలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

2 hours ago 1

సాధారణంగా పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు.. మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, అవశేషాలు బయటపడటం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి.

 పురాతన తవ్వకాల్లో బయటపడ్డ మట్టి కుండలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

Treasure

Ravi Kiran

|

Updated on: Feb 02, 2025 | 8:30 AM

సాధారణంగా పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు.. మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, అవశేషాలు బయటపడటం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేలలో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఇతర నాణేలపై కూడా వివిధ రకాల బొమ్మలు చెప్పబడ్డాయి. ఇందులో కొన్ని బ్రిటీష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ అమరపతి ఖేడా స్మారక ప్రదేశం 1920 నుంచి ఏఎస్ఐ రక్షణలో ఉంది.

అలాగే సోత్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశంలో గతంలో సమాధి ఉండేదని.. నది నీటి ప్రభావంతో మట్టి తొలిగిపోయినప్పుడు.. అక్కడ కొన్ని అస్థిపంజరాలు, కమండలం, రాయి కూడా కనిపించాయని స్థానికులు అంటున్నారు. సుమారు 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ ఆస్థిపంజరం కూడా బయటపడినట్టు తెలిపారు. అది గురు అమర్‌ సమాధిగా ఏఎస్‌ఐ రికార్డుల్లో ఉందని అన్నారు. మరోవైపు ఆ పురాతన నాణేలతో పాటు 4 వందల ఏళ్ల నాటి మట్టి పాత్రలు కూడా లభ్యమయ్యాయట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article