ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి జల్సాలకు అలవాటుపడి దొంగగామారి, చివరికి జైలు పాలయ్యాడు. హైదరాబాద్లోని మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటకు చెందిన కాళహస్తి హరీశ్కృష్ణ గాజుల రామారంలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న హరీశ్కృష్ణ బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడ్డాడు.
నెలకు వచ్చే లక్షా 10వేల జీతం జల్సాలు, అప్పులకు సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో తన కంపెనీలో పనిచేసే కేవీ.మణికంఠతో హరీశ్కృష్ణకు పరిచయం ఏర్పడింది. మాదాపూర్ చంద్రానాయక్ తండాలో ఉండే మణికంఠ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూప్ చాటింగ్ ద్వారా ఈ నెల 25న మణికంఠ ఇంట్లో లేడన్న విషయాన్ని నిర్ధారించుకున్నాడు. ఆ రోజు ఉదయం 11.15 గంటలకు ముఖానికి ముసుగు, తలకు హెల్మెట్ ధరించి వాళ్లింటికి వెళ్లాడు. మణికంఠ భార్యను కత్తితో బెదిరిస్తూ ఒంటిపైనున్న నగలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె అతడిని ప్రతిఘటించడంతో చేతికి గాయమైంది. ఇదే అదునుగా ఆమె చేతి గాజులు లాక్కుని పరారయ్యాడు.
మరిన్ని వీడియోల కోసం :
బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది
పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు!