అవసరాలకు బ్యాంక్ల నుంచి లోన్స్ తీసుకుని ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇటీవలి బడ్జెట్ నేపథ్యంలో ఈ ద్రవ్యసమీక్షపై అటు వ్యాపార-పారిశ్రామిక రంగాలు, ఇటు బ్యాంకర్లు-రుణగ్రహీతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే రెపో రేటును పావు శాతం కోత పెట్టింది ఆర్బీఐ. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకూ 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది. అలాగే రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రెపో రేట్ అంటే రిజర్వ్బ్యాంక్ దగ్గర బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటు అని అర్థం. ఈ వడ్డీరేటు తగ్గితే, ప్రజలకు ఊరట లభిస్తుంది. వారి రుణాలపై వడ్డీభారం తగ్గుతుంది. మానిటరీ పాలసీ కమిటీ 5-1 తేడాతో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గత 11 సమావేశాల్లో మానిటరీ పాలసీ కమిటీ రెపోరేట్లను తగ్గించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్
చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ