Budget-2025: కేంద్ర బడ్జెట్ నుండి NDA మిత్రపక్షాలు ఏమి పొందాయి? ఏపీకి కేటాయించింది ఎంత?

3 hours ago 1

మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఊహించని కానుక అందించారు. ఆదాయపన్ను విషయంలో ఆమె ఎంతో ఉదారంగా వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో ఇంత వరకు ఎన్నడూ లేని రీతిలో ఆదాయపన్ను మినహాయింపును నిర్మలా సీతారామన్‌ భారీగా ప్రకటించారు.

ధరలు పెంచారా, తగ్గించారా అనే విషయాలు పక్కన పెడితే బడ్జెట్‌ అనగానే వేతనజీవులు ఆశగా ఎదురుచూసేది ఆదాయ పన్ను మినహాయింపు. ఈసారి వారి పంట పండింది. మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా వేతనజీవులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఊహించనంత భారీ ఊరట కల్పించింది. ఆదాయ పన్ను పరిమితిపై వస్తున్న రకరకాల ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ ఏకంగా 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపును నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

దేశాభివృద్ధిని పెంచేందుకు, ప్రపంచంతో పోటీ పడేందుకు పన్నుల వ్యవస్థ, విద్యుత్‌ రంగం, పట్టణాభివృద్ధి, మైనింగ్‌, ఆర్థిక రంగం, నియంత్రణా సంస్కరణలనే ఆరు కీలక రంగాలను నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు. ఇండియా పోస్ట్‌ను భారీ ప్రభుత్వ రంగ రవాణా సంస్థగా మార్చుతామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విశ్వకర్మలు, మహిళలు, స్వయంసహాయక సంఘాలు, MSMEలు, భారీ వ్యాపార సంస్థల అవసరాలు తీర్చేలా ఇండియా పోస్ట్‌ పనిచేస్తుందని తెలిపారు. 50 కోట్ల రూపాయలతో విద్యారంగం కోసం ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌లో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులలో వైద్య సీట్లు 75 వేలకు పెంచాలనే లక్ష్యంతో వచ్చే సంవత్సరం కొత్తగా 10వేల అదనపు సీట్లు తీసుకురానున్నట్టు తెలిపారు.

మోదీ ప్రభుత్వ బడ్జెట్ 2025పై రాజకీయ పక్షాలు స్పందించాయి. ఇది ప్రజల బడ్జెట్‌ అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రభుత్వ ఖజానా నింపడం కాదు పౌరుల జేబులు నింపడంపై దృష్టి పెట్టిన బడ్జెట్‌ ఇదని ప్రధాని అన్నారు. వికసిత్‌ భారత్‌ను సాకారం చేసే లక్ష్యంగా.. బడ్జెట్‌ బ్రహ్మండంగా వుందని ఎన్‌డీఏ నేతలు అన్నారు . మూడు రాష్ట్రాల ఎన్నికల కోసమే బుల్డోజ్‌ చేసినట్టుగా వుందని బడ్జెట్‌పై విపక్షాలు విమర్శిస్తున్నాయి. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో కూడా విపక్ష ఎంపీలు బీహార్‌పై దుమారం రేపారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని విపక్ష ఎంపీలు అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రజానుకూలమైన ప్రగతి శీలబడ్జెట్‌ అభివర్ణించారు సీఎం చంద్రబాబు . కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలు. ప్రధానికి మోదీకి , నిర్మాలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిసారు .ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామన్నారు

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. పార్టీ 272 అనే మ్యాజికల్ ఫిగర్‌కు 32 అడుగుల దూరంలో ఉండిపోయింది. ఆ తర్వాత NDA పార్టీల సహాయంతో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీయేలో బీహార్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభావం ఎక్కువగా ఉంది. బీహార్‌లోని JDU, LJP (R), HAM (SE) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ, పవన్ కళ్యాణ్‌కి చెందిన జనసేన కూడా ఎన్డీయేలో భాగమయ్యాయి.

గత బడ్జెట్‌లోనూ కూడా రెండు రాష్ట్రాలు బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి కూడా బడ్జెట్‌లో ఇద్దరికి ఆధిక్యత చూపెట్టారు. మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో మిత్రపక్షాలకు ఏం ఇచ్చిందో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

చంద్రబాబు నాయుడు పార్టీకి 16 మంది ఎంపీలు, పవన్ కళ్యాణ్ పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు చేపట్టబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించాలని మోదీ సర్కార్‌ను కోరారు. దానికి కేంద్రం అంగీకరించింది. ఆంధ్రాకు చెందిన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు రూ.30,436 కోట్లకు ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వానికి పాత బకాయిలను అందించనుంది. ఈ ప్రాజెక్ట్ గోదావరి నది ఏలూరు జిల్లాలో నిర్మిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించింది. 2013లో ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది. అప్పటి నుంచి రాజధాని హైదరాబాద్ ఆంధ్రాకి దూరమైంది. ఇప్పుడు అమరావతిని రాజధాని చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం బిజీగా ఉంది. న్యూక్లియర్ సోలమ్ ప్రాజెక్ట్ కింద ఆంధ్ర కూడా వాటా పొందనుంది. అయితే దీని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ప్రస్తుతం 12 మంది లోక్ సభ ఎంపీలు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే బీహార్‌లో నితీష్ కుమార్‌కు మద్దతుగా పెద్ద ప్రకటనలు చేశారు. వీటిలో మఖానా బోర్డు ఏర్పాటు ముఖ్యమైనది. దీంతో మిథిలాంచల్ ప్రజలు నేరుగా లబ్ధి పొందనున్నారు. దీంతో పాటు పాట్నా, బిహ్తా విమానాశ్రయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇక, పశ్చిమ కోసి కెనాల్ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల దర్భంగా, మధుబని ప్రజలు లబ్ధి పొందనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే, బీహార్‌లో 3 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విమానాశ్రయం రాజ్‌గిర్, సోన్‌పూర్, భాగల్‌పూర్‌లలో ప్రతిపాదించారు. రాజ్‌గిర్ నితీష్ సొంత జిల్లా నలందలో ఉంది.

బీహార్ రాష్ట్రానికి చెందిన చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. చిరాగ్ పార్టీకి 5 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. చిరాగ్ కోసం నేషనల్ ఫుడ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది కేంద్రం. చిరాగ్ మంత్రిగా ఉన్న ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ క్రింద ఈ సంస్థ ఏర్పాటు కానుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను జాముయి, హాజీపూర్ లేదా సమస్తిపూర్‌లో నిర్మించవచ్చని చెబుతున్నారు. మూడు చోట్లా చిరాగ్ పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నారు. చిరాగ్ స్వయంగా హాజీపూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. అతని బావ అరుణ్ భారతి జముయి నుంచి ఎంపీగా ఉన్నారు. చిరాగ్ స్వస్థలం సమస్తిపూర్‌లో కావడం విశేషం.

అజిత్ పవార్ NDA మిత్రపక్షంలో ఉన్నారు. పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా. అజిత్‌ పవార్‌ డిమాండ్‌ను బీజేపీ కూడా పరిగణనలోకి తీసుకుంది. పుణెలో మెట్రో కోసం రూ.837 కోట్లు ఇచ్చారు. పూణే అజిత్ పవార్ స్వస్థలం. ఆయన ఇక్కడ రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు. ఇది కాకుండా, మహారాష్ట్ర అగ్రి బిజినెస్ నెట్‌వర్క్-మాగ్నెట్ ప్రాజెక్ట్ కోసం బడ్జెట్‌లో రూ.596 కోట్లు కేటాయించారు. మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా బీజేపీకి ప్రధాన మిత్రుడు. బీజేపీ కూడా వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ముంబైలో మెట్రో కోసం రూ.1,600 కోట్లు ఇచ్చారు. డిప్యూటీ సీఎం షిండే ముంబైకి గార్డియన్ మంత్రిగా ఉన్నారు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ప్రాజెక్ట్ కింద ముంబైకి రూ.1,094 కోట్లు ఇచ్చారు. లోక్‌సభలో ఏకనాథ్ షిండేకు మొత్తం 7 మంది ఎంపీలు ఉన్నారు. బడ్జెట్‌ను షిండే స్వాగతించారు.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article