పాతబస్తీ డబీర్పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శృంగారం కోసం...గ్రైండర్ అనే డేటింగ్ యాప్ను ఉపయోగించేవాడు. జనవరి 19వ తేదీన ఆ యాప్లో అతనికి మరో గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్ చేసుకున్న తర్వాత ఏకాంతంగా గడిపేందుకు ఓ ప్రాంతాన్ని ఫిక్స్ చేశారు. తీరా అక్కడికి వెళ్లాక..
Building Construction (Representative image)
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన వ్యక్తిని నిర్మాణంలో ఉన్న భవనంపైకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఏటీఎం కార్డును లాక్కున్న వ్యక్తి….40వేలు విత్ డ్రా చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులకు డెకాయిట్ గ్యాంగ్లోని ఐదుగురు సభ్యులు పట్టుబడ్డారు.
పాతబస్తీ డబీర్పురకు చెందిన ఓ వ్యక్తి గ్రైండర్ అనే డేటింగ్ యాప్ను ఉపయోగించేవాడు. జనవరి 19న గ్రైండర్ యాప్ను ఓపెన్ చేశాడు. యాప్లో ఓగుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. చాటింగ్లో పరస్పరం అంగీకారంతో చార్మినార్గుర్వాన గల్లీ దగ్గరకు చేరుకున్నారు. అక్కడే నిర్మాణంలో ఉన్న భవనంపైకి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మరో నలుగురు కాపుకాశారు. అంతా కలిసి క్షణాల్లో ఆవ్యక్తిని చుట్టుముట్టి కత్తులతో బెదిరించి దోచుకున్నారు. మలక్పేట్లోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి రూ.40వేల నగదును డ్రా చేశారు.
షాక్కు గురైన బాధితుడు.. తేరుకుని ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మలక్పేట్ ఏటీఎం సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఫలక్నుమా, మొఘల్పురా సైదాబాద్ కాలనీకి ప్రాంతాలకి చెందిన 25 ఏళ్లు లోపు వ్యక్తులుగా గుర్తించారు. ఫిర్యాదు అందిన నాలుగు రోజుల్లో కేసును చేధించిన మీర్పేట్ పోలీసులను సౌత్జోన్ డీసీపీ స్నేహ మెహ్రా అభినందించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి